ఏపీలో కొత్తగా 6,770 కరోనా కేసులు

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 6,770 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18,09,844కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 58 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11940 మంది మృతిచెందారు. ఇకపోతే ఒక్కరోజులో 12,492 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17,12,267 డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 85,637 యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పటివరకు 2,04,50,982 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.


Next Story

Most Viewed