- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలి కారు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. యాక్సిడెంట్కు ముందు జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో మిత్తీ మోడీ ఎంజాయ్ చేసినట్టు తేలింది. అనంతరం మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రియాంక అదే సమయంలో కారులోనే ఉండి.. సీటు బెల్టు పెట్టుకోనట్టు తేలింది. ఇక అపాస్మారక స్థితిలో అతివేగంగా డ్రైవింగ్ చేసిన మిత్తీ మోడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద చెట్టును ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో ప్రియాంక(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మిత్తీ మోడీ(20) గాయాల పాలయ్యాడు. అయితే, విశాఖకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడు అయిన మోడీ.. హైదరాబాద్కు ఎందుకొచ్చాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక రష్యాలో ఎంబీబీఎస్ చేస్తున్న ప్రియాంక లాక్డౌన్ నుంచి హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ వద్దకు వెళ్తానని చెప్పిన ప్రియాంక.. చివరకు మిత్తీ మోడీ అతివేగానికి బలైపోయింది.