‘ఫోటో చూసి సమావేశానికి వచ్చాడనుకున్న’

by  |
‘ఫోటో చూసి సమావేశానికి వచ్చాడనుకున్న’
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే కేవలం పేరుకే ఉన్నారని విరుచుకుపడ్డారు. సమావేశంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీపై ఎమ్మెల్యే ఫోటో చూసి ఈ కార్యక్రమానికి వచ్చాడేమో అని అనుమానం కలిగిందన్నారు. ఆరు నెలలుగా జిల్లా ప్రజలను జగ్గారెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో హోటళ్లలో కూర్చుని కాలం వెల్లదీస్తున్నాడని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed