- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని శ్వేత తల్లిదండ్రులు శ్వేతను హత్య చేసి రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని అజయ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని వాపోయారు.
ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. శ్వేత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడని అజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాచకొండ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తే సీఐ, టెక్నీషియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గత నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన శ్వేత ఘట్కేసర్ రైలు పట్టాలపై శవమై తేలిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్వేతది ఆత్మహత్య..? హత్య..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.