- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నొవేటివ్ అచీవ్మెంట్స్ – 2020 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాల వేదిక ద్వారా మంగళవారం ఆయన ప్రసంగించారు.
ఈ సంద్భరంగా పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడం, ప్రాసెసింగ్, రవాణా తదితర అంశాల్లో వినూత్న పద్ధతుల దిశగా పరిశోధనలు సాగాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు వెంకయ్యనాయుడు సూచించారు. విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యతనివ్వాలని, అప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలకు.. తద్వారా కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తంచేశారు.
Next Story