20న ఆ నలుగురికి ఉరి

by Batti.Sumithra |

<p>నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 20న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్భయ దోషులకు డెత్ వారెంట్‌కు సంబంధించి బుధవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. ఉరి వాయిదాకు సంబంధించి నలుగురు దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు. దోషుల తరుపున [&hellip;]</p>

20న ఆ నలుగురికి ఉరి
X

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. ఈ నెల 20న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్భయ దోషులకు డెత్ వారెంట్‌కు సంబంధించి బుధవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. ఉరి వాయిదాకు సంబంధించి నలుగురు దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు. దోషుల తరుపున వాదించిన ఏపీ‌సింగ్ కూడా ఉరి వాయిదా వేయడానికి న్యాయపరంగా ఇక ఎటువంటి అవకాశాలు లేవని అంగీకరించారు. దీంతో కోర్టు దోషులకు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది.

slug; new death warrant issued delhi court on nirbhaya case

Next Story