కరోనా ఎంత పని చేసింది.. న్యూ కపుల్ ‘ఫస్ట్ నైట్’ వాయిదా

by  |
కరోనా ఎంత పని చేసింది.. న్యూ కపుల్ ‘ఫస్ట్ నైట్’ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఇప్పటి వరకు పెళ్లిళ్లు పోస్ట్ పోన్ అయిన విషయం మనకు తెలిసిందే. కానీ, కొత్తగా ఓ పెళ్లైన జంటకు కరోనా మహ్మమారి చేదు అనుభవాన్ని ఇచ్చింది. విషయం ఏంటంటే.. కేరళలో వివాహం చేసుకున్న నూతన జంటకు వింత అనుభవం ఎదురైంది. పెళ్లి తంతు పూర్తి చేసుకుని.. ఎంతో ఆత్రుతతో తొలిరాత్రికి సిద్ధమవుతున్న ఆ కపుల్స్‌కు కరోనా పెద్ద షాక్ ఇచ్చింది.

ఈనెల 25వ తేదీన కర్ణాటక కొడగు ప్రాంతానికి చెందిన వధువు.. కేరళకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే వధువరులిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు వధువు కొవిడ్ టెస్టులు చేయించుకుంది. టెస్టు రిజల్ట్ కాస్తా.. పాజిటివ్ అని పెళ్లి జరిగిన తర్వాత ఫోన్‌కు మేసేజ్ వచ్చింది. దీంతో కొత్త జంటకు.. ఫస్ట్​నైట్ ఆశలు ఆవిరయ్యాయి. వధువుకు పాజిటివ్ తేలడంతో కుటుంబ సభ్యులు కూడా టెస్టులు చేయించుకోగా వారందరికీ నెగిటివ్ అని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed