- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా రెండో దశ ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన పదిహేను రోజులుగా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్నది. అయితే దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్-19 కేసుల సంఖ్య కాస్త తగ్గగా.. బుధవారం మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చితే ఈరోజు ఏకంగా 7 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇది మంగళవారం (40,715) తో పోల్చితే దాదాపు ఏడు వేలు అధికం. కానీ సోమవారం దేశవ్యాప్తంగా 46,951 మంది కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా సోకి మరణించిన వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుంది. గత 24 గంటల్లో 275 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,441 కు చేరుకుంది.
Next Story