శేరిలింగంపల్లిలో నవ వధువు ఆత్మహత్య

by  |
Bribe-Suicide1
X

దిశ, శేరిలింగంపల్లి: భర్త, అత్తమామల వేధింపులతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి డివిజన్ డోయెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఫాతిమా గతరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలే వివాహం జరిగిందని, అప్పటి నుండి భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఫాతిమా ఆత్మహత్య చేసుకుందని తల్లితండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed