ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,85,710ను చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఒక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 7139 మంది చని పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 232 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 8.76 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2199 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.76 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story