ముంబై పోలీస్ కమిషనర్‎పై నెటిజన్ల ఫైర్

by  |
ముంబై పోలీస్ కమిషనర్‎పై నెటిజన్ల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ టీఆర్పీ రేటింగ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తామే ఈ విషయాన్ని బట్టబయలు చేశామని చెప్పుకుంటున్న ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింహ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లిక్ టీవీతోపాటు మరో రెండు చానెల్స్ టీఆర్పీ కుంభకోణానికి పాల్పడినట్లు గురువారం కమిషనర్ వెల్లడించారు. దీనిపై రిపబ్లిక్ టీవీ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని విచారిస్తామని ప్రకటించారు.

కాగా, హన్సా రీసెర్చ్ ఏజెన్సీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రిపబ్లిక్ టీవీ పేరు లేదని అర్నబ్ గోస్వామి శుక్రవారం సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. దీంతో నెటిజన్లు ముంబై పోలీస్ కమిషనర్‌పై ట్వీట్టర్ వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. రిపబ్లిక్ టీవీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #परमबीरसिंहइस्तीफा_दो హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.


Next Story

Most Viewed