వృద్ధురాలికి మత్తు మందు.. భారీ చోరీ

by  |
వృద్ధురాలికి మత్తు మందు.. భారీ చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి భారీ చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హెచ్‌ఎంటీనగర్‌కు చెందిన ప్రదీప్‎ కుమార్‌ ప్రైవేటు ఉద్యోగి. భార్య, పిల్లలు, తల్లితో కలిసి ఉంటున్నారు. ప్రదీప్ కుమార్ ఆఫీసుకు వెళ్లగా.. ఓ శుభకార్యానికి ఆయన భార్య, పిల్లలు వెళ్లారు.

నేపాల్‌కు చెందిన అర్జున్‌, మాయ దంపతులు కొన్నిరోజుల క్రితం ప్రదీప్ ఇంట్లో పనిలో చేరారు. కొంతకాలం నమ్మకంగా పనిచేసిన వారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రదీప్ తల్లి తల్లి లలితకు మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న రూ.10 లక్షలు, 18 తులాల బంగారం, 40 తులాల వెండి దోచుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed