అన్నంలో మత్తు మందు కలిపి.. రూ.30లక్షలు చోరీ

by  |
అన్నంలో మత్తు మందు కలిపి.. రూ.30లక్షలు చోరీ
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తులే యాజమానులు తినే ఆహారంలో మత్తు మందు కలిపి భారీ చోరీకి పాల్పడిన సంఘటన హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. మదుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10నెలలుగా నేపాల్‌కు చెందిన రవి అలియాస్ రాజేందర్, మనోజ్, జానకీ, రవి చెల్లెలు సీతలు.. యాజమానులు తినే ఆహారంలో మత్తు మందు కలిపి.. వారు స్పృహా కోల్పొయిన తర్వాత ఇంట్లోని రూ.15లక్షల నగదుతో పాటు బంగారం ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ మొత్తం విలువ రూ.30 లక్షలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం యాజమాని మదుసూదన్ రెడ్డి, ఆయన భార్య శైలజ, కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి, అయాన్‌లు కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed