నీట్‌ ఫలితాలు విడుదల

by  |
నీట్‌ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్ : దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్‌) 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు 90 శాతం మంది హజరయ్యారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాశారు. ఈ పరీక్షల ఫలితాలను ఎన్‎టీఏ అధికారిక వెబ్‎సైట్ http://ntaneet.nic.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.


Next Story

Most Viewed