ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదు.. విచారణ వాయిదా

by  |
Neelam Sahni, AP SEC
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియమాకాన్ని సవాల్‌ చేస్తూ డా.శైలజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా నీలం సాహ్నిని నియమించారని పిటిషనర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించిందని.. అయితే ఆ తీర్పును అర్థం చేసుకోకుండా రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారని వాదించారు. నీలం సాహ్ని నియామకం వల్ల రూ.160 కోట్లు ప్రజా ధనం వృథా అయిందన్నారు. ఈ ప్రజాధనాన్ని ఎవరి నుంచి రాబడతారని ప్రశ్నించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.


Next Story

Most Viewed