ఇండియన్ ఫిలాంత్రపిస్ట్‌పై డైరెక్టర్ నీలకంఠ బయోపిక్

by  |
ఇండియన్ ఫిలాంత్రపిస్ట్‌పై డైరెక్టర్ నీలకంఠ బయోపిక్
X

దిశ, సినిమా : ‘మిస్సమ్మ, సదా మీ సేవలో, విరోధి’ తదితర చిత్రాల దర్శకుడు నీలకంఠ ఓ బయోపిక్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రథమ భూదాతగా పేరొందిన పోచంపల్లికి చెందిన దివంగత వెదిరె రామచంద్రారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోభాబావే అడగగానే 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన రామచంద్రారెడ్డి.. భూదాన కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగేందుకు స్ఫూర్తినిచ్చారు. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించనుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.

Next Story

Most Viewed