‘బాయ్’ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిత్యావసరాల పంపిణీ

by  |
‘బాయ్’ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతుగా సాయం అందించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ముందుకు వచ్చింది. మంగళవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు, వీఆర్ఏ, హోంగార్డులు, అంగన్‌వాడీలు, జర్నలిస్టులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఉద్యోగులను ఆదుకునేందుకు ‘బాయ్’ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు.

Tags: minister vemula prashanth reddy, supply necessities to asha workers, home guards,anganwadis


Next Story

Most Viewed