రేపు ప్రతిపక్ష పార్టీ నేతల కీలక భేటీ.. విషయం ఏంటంటే..

by  |
NCP Sharad-Pawar
X

దిశ, వెబ్‌డెస్క్ : మంగళవారం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు విపక్ష పార్టీలకు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా లేఖలు రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వనం. ఈ క్రమంలో సమావేశానికి దేశంలోని 15 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు కానున్నారు. అయితే.. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా.. సమిష్టి పోరాటానికి సమాయత్తం కావాలని ప్రతిపక్ష నేతలను వారు కోరారు. ప్రతిపక్షపార్టీలకు యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్ తరఫున ఆహ్వానాలను పంపించారు.


Next Story

Most Viewed