నయన త్యాగం.. జాన్వీకి కలిసి వచ్చేనా..?

by  |
నయన త్యాగం.. జాన్వీకి కలిసి వచ్చేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ త్యాగం చేయబోతుందట. తన అందచందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేసిన నయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. హీరోలకు ఏమాత్రం తగ్గని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నయన ఇటీవల నటించిన కొలమాను కోకిల సినిమాతో ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. తమిళంలో ఘన విజయం సాధించిన ఆ మూవీ తెలుగులో కోకో కోకిలగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఇదే సినిమాను నయన తార.. జాన్వీకపూర్ కోసం వదులుకుందట.

అయితే ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక, నిర్మాతలు. కాగా ఈ సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ ను ఎన్నుకున్నారని లేటెస్ట్ న్యూస్. కోకిల చిత్రం ద్వారా నయనతార భారీ హిట్ దక్కించుకుంది. తన నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. సౌత్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవ్వడం తో హిందీలో రీమేక్ చేయాలని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ రెడీ అవుతున్నాడట. అందాల తార శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ ధడకన్ సినిమాతో వెండితెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. నటనతో తానేమిటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు నటన పరంగా జాన్వీకి బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజే నెలకొంది.

కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా దోస్తానా సీక్వెల్ దోస్తానా 2 లో నటిస్తోంది జాన్వీకపూర్. అలాగే మరో చిత్రం రూహీ ఆఫ్ జా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో.. తెలుగులో విజయం సాధించిన కోకిల సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ జనవరి 9 నుంచి పంజాబ్ లో మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లోనే ఈ సినిమాని కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే జాన్వీ కపూర్ సాలీడ్ హిట్ కోసమే నయనతార నటించిన ఈ సినిమాని ఎంచుకుందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చెప్పుకుంటున్నారట. జాన్వీ కోసమే నయన కూడా బాలీవుడ్ ఆఫర్ ను వదులుకుందని కోలివుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story

Most Viewed