'అందుకే శ్రీవారిని దర్శించుకున్నా.. తెలుగు ప్రజల వల్లే పేరు వచ్చింది'

by  |
అందుకే శ్రీవారిని దర్శించుకున్నా.. తెలుగు ప్రజల వల్లే పేరు వచ్చింది
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజల వల్లే తనకు మంచి పేరు వచ్చిందని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు పత్రం అంటూ ప్రత్యర్థులు వేసిన పిటిషన్‌పై ముంబై హైకోర్టు స్టే విధించిందని, అందుకే శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని తాను అనుకుంటున్నానని, రైతులు, మహిళలు, యువతకు సాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు నవనీత్ కౌర్ తెలిపారు.

Next Story

Most Viewed