రెమ్యునరేషన్ పెంచేసిన జాతిరత్నం

by  |
naveen polishetty
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో స్టార్ అయిపోయిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. ఇకపై స్టార్ రేంజ్‌లోనే రెమ్యునరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ కుర్ర హీరో.. ఇంతకుముందు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, చిచోరే’ సినిమాలకు లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ ‘జాతిరత్నాలు’ సక్సెస్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్‌లకు మూడింతలు పెంచేసి కోట్లలో డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఇప్పటికే టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్‌లు యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌తో సినిమాలు చేసేందుకు సైన్ చేసిన నవీన్ పొలిశెట్టి.. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


Next Story

Most Viewed