ఢిల్లీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రెజ్లర్లు.. అసలు కారణం ఏంటి..?

by Disha Web Desk 12 |
ఢిల్లీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న రెజ్లర్లు.. అసలు కారణం ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌కు వ్యతిరేఖంగా రెజ్లర్లు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా.. ఢిల్లీ ఫుట్ పాత్ పై రెజ్లర్లు పడుకున్న ఫొటోలను.. జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ వినేష్ ఫోగట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీనికి వారు.. "పోడియం నుండి పేవ్‌మెంట్ వరకు. అర్ధరాత్రి ఓపెన్ స్కై కింద న్యాయం జరుగుతుందనే ఆశతో" అని రాసుకొచ్చారు. కాగా గత కొంతకాలంగా ఈ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రెజ్లర్ల నిరసనకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

Read More:

దాని కోసం నేను చావడానికైనా సిద్దమే: Vinesh Phogat

భారత రెజ్లర్లు చేపట్టిన దీక్షలో కీలక పరిణామం


Next Story