- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదులుతున్న బసులో మహిళ ప్రసవం.. పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన మహా తల్లి..
మహారాష్ట్ర పర్భణిలో కదులుతున్న బసులో ప్రసవించిన మహిళ పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి బయటకు విసిరేసింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పర్భణిలో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న బసులో ప్రసవించిన మహిళ పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. రితికా ధేరే అనే 19ఏళ్ల మహిళ.. జూలై 15 ఉదయం 6:30 గంటల సమయంలో పాథ్రి-సేలు రోడ్డుపై ఈ దారుణానికి ఒడిగట్టింది. తన భర్త అని చెప్పుకున్న అల్తాఫ్ షేక్తో కలిసి పూణే నుండి పర్భణికి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణించిన ఆమె.. అందులోనే డెలివరీ అయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ నవజాత శిశువును గుడ్డలో చుట్టి బస్సు కిటికీ నుంచి బయటకు విసిరిసేంది. దీని ఫలితంగా శిశువు మరణించింది.
డ్రైవర్ బస్సు నుంచి ఏదో విసిరినట్లు గమనించి.. శిశువు శరీరాన్ని కనుగొని 112 హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. జంట మొదట రితికాకు మోషన్ సిక్నెస్ కారణంగా వాంతి అయినట్లు చెప్పింది. కానీ బస్సులోని మరో మహిళా ప్రయాణికురాలు ఈ చర్యను చూసి పోలీసులకు తెలియజేసింది. పోలీసులు బస్సును అడ్డగించి... రితికా మరియు అల్తాఫ్ను అదుపులోకి తీసుకొని.. రితికాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పూణేలో గత 18 నెలలుగా నివసిస్తున్న ఈ జంట.. ఆర్థిక, వ్యక్తిగత కష్టాల కారణంగా శిశువును పెంచలేక ఈ పని చేసినట్లు ఒప్పుకున్నారు. వారు వివాహితులమని చెప్పినప్పటికీ.. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. పాథ్రి పోలీస్ స్టేషన్లో వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 94 (3), (5) కింద కేసు నమోదు చేయబడింది.






