నాలుగోసారి కూడా మోడీయే ప్రధాని: రాజ్‌నాథ్ సింగ్

by Dishanational1 |
నాలుగోసారి కూడా మోడీయే ప్రధాని: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి, అలాగే నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తారని, ప్రజలు కోరుకునేంత వరకు ఆయన తన సేవలను కొనసాగిస్తారని రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయంగా భారత స్థాయిని ఎవరు పెంచుతున్నారో ప్రజలు చూస్తున్నారని, దాన్ని మరింత పెంచేలా మోడీ చేయగలరని అన్నారు. మోడీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రజలు మోడీతోనే ఉన్నారు. కాబట్టి మూడోసారి మాత్రమే కాదు నాలుగోసారి కూడా మోడీ ప్రధాని అవుతారు. ఆయన సామర్థ్యాన్ని దేశం కోరుకునే వరకు వినియోగిస్తారన్నారు. ఇదే సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటకలో బీజేపీ స్వీప్ చేస్తుందని, కేరళ, తమిళనాడుల్లోనూ మెరుగైన సీట్లను గెలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా దక్షిణాదిన ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలవనున్నట్టు చెప్పారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed