- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
supreme Court: హిందూ బోర్డుల్లో ముస్లింలను అంగీకరిస్తారా? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

దిశ, డైనమిక్ బ్యూరో : వక్ఫ్ బోర్డు (waqf board) మాదిరిగా హిందూ బోర్డుల్లో ముస్లింలను అంగీకరిస్తారా? సూటిగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా? వారి ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని నిలదీసింది. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని, కలెక్టర్లకు అధికారాలపై స్పష్టతతోపాటు తమ సందేహాలకు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై ఇవాళ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున కపిల్ సిబాల్(kapil sibal), కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి.
హింస బాధాకరం..
వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని, ఆ ఘటనలు తమను బాధించాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కాగా పిటిషన్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అని వాదించారు. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైనదని పేర్కొన్నారు.
అనేక చర్చల తర్వాతే చట్టం..
కేంద్రం తరఫున తుషార్ మెహతా (tushar mehta) తన వాదన వినిపిస్తూ.. జేపీసీ ఏర్పాటు చేసి అన్ని వర్గాలతో చర్చలు జరిపామని, వక్ఫ్ అనేది చారిటీకి సంబంధించినది మాత్రమేనని కోర్టుకు తెలిపారు. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని ఆ సంస్థల్లో హిందూయేతర అధికారులు కూడా ఉన్నారని కోర్టుకు వివరించారు. వక్ఫ్ బై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారని, రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకు ఉన్న అభ్యంతరం ఏంటి అని అన్నారు. కాగా హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా పార్లమెంట్లో చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా? ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉంది. చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించలేమని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.