సంజయ్ రౌత్‌కు బెదిరింపు సందేశాలు

by Disha Web Desk 7 |
సంజయ్ రౌత్‌కు బెదిరింపు సందేశాలు
X

న్యూఢిల్లీ: థాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పంజాబ్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ సందేశాలు వచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు చెప్పారు. నా మొబైల్ ఫోన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చాను. అయితే ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

గతంలోనూ ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. ఒకవేళ ఢిల్లీలో ఎదురైతే ఏకే-47‌తో చంపేస్తామని మెసేజ్ చేసినట్లు చెప్పారు. మూసేవాలాకు పట్టిన గతే తనకు పడుతుందని బెదిరించానని అన్నారు. సల్మాన్‌‌ను కూడా చంపేస్తామని సందేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed