- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సంజయ్ రౌత్కు బెదిరింపు సందేశాలు
న్యూఢిల్లీ: థాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పంజాబ్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ సందేశాలు వచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు చెప్పారు. నా మొబైల్ ఫోన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చాను. అయితే ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు.
గతంలోనూ ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. ఒకవేళ ఢిల్లీలో ఎదురైతే ఏకే-47తో చంపేస్తామని మెసేజ్ చేసినట్లు చెప్పారు. మూసేవాలాకు పట్టిన గతే తనకు పడుతుందని బెదిరించానని అన్నారు. సల్మాన్ను కూడా చంపేస్తామని సందేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.