పశ్చిమ బెంగాల్‌ ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు..

by Disha Web Desk 12 |
పశ్చిమ బెంగాల్‌ ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం మరోసారి రామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి హింస చెలరేగింది. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడ్డారు. శోభా యాత్రలో వెళ్తున్న ఎమ్మెల్నే బిమన్‌ను ఓ వర్గానికి చెందిన గుండాలు కొట్టారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంద్ మజుందార్ ఆరోపించారు. గాయపడిన ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి చేజారి పోతుండటంతో ఆ ప్రాంతంలోని రిశ్రా వార్డులు 1-5, సెరంపూర్ వార్డు 24లో CrPC సెక్షన్ 144 సెక్షన్ విధించారు.

Next Story

Most Viewed