కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభానికి ముందే మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదని.. మరో రెండు గంటలు వేచి చూద్దామన్నారు. అంతేకాకుండా ఏ పార్టీ తనకు సీఎం పదవి ఆఫర్ చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కర్నాటకలో ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఎగ్జిట్ పోల్స్‌పై రియాక్ట్ అయిన కుమారస్వామి.. సెటైర్లు వేశారు. ఇక, కర్నాటకలో ఈ సారి హంగ్ ఏర్పడుతుందని.. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజార్టీ రాదని.. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమై కర్నాటకలో హంగ్ ఏర్పడితే కన్నడ రాజకీయాల్లో జేడీఎస్ కింగ్ మేకర్ కానుంది.

Also Read...

ఎన్నికల ఫలితాల వేళ సీఎంకు విచిత్ర అనుభవం.. బొమ్మై ఆఫీసులో పాము కలకలం (వీడియో)

Next Story

Most Viewed