- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేం వీఐపీలం.. క్యూలో నిలబడం’.. ఐపీఎల్ టికెట్లపై కర్ణాటక ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
ఈ నెల 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనున్న ఐపీఎల్ (IPL 2026) మ్యాచ్ టికెట్ల వ్యవహారం కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసింది. తమకు వీఐపీ టికెట్లు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పాస్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప మండిపడ్డారు. ‘మేం వీఐపీలం, సాధారణ ప్రజల మాదిరి క్యూలో నిలబడలేము’ అని ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
రూ.5 వేల టికెట్ బ్లాక్లో రూ.35 వేలు..
ప్రభుత్వం నుంచి భద్రత సహా అన్ని ఉచిత సౌకర్యాలు పొందుతున్న KSCA అసోసియేషన్, ప్రజాప్రతినిధులను మాత్రం అగౌరవపరుస్తోందని ఆయన ఆరోపించారు. రూ.5,000 విలువైన టికెట్ను బ్లాక్ మార్కెట్లో దళారుల వద్ద రూ.35,000 పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఆందోళనపై అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యేకు కనీసం నాలుగు వీఐపీ (VIP) టికెట్లు అందేలా చూడాలని, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు స్టేడియంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై వెంటనే KSCA అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు సమాచారం.






