ముదురుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మల్టీ వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రయోగం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 05:42:18  IST  )

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఐదు భారీ మల్టీ-వార్‌హెడ్ క్షిపణులను ప్రయోగించింది.

ముదురుతున్న యుద్ధం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మల్టీ వార్‌హెడ్ మిస్సైల్స్ ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా (Western Asia)లో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్ చేపట్టిన ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ (Operation True Promise 4)‌లో భాగంగా ఇవాళ ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి దాడులకు దిగింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ‘ప్రెస్ టీవీ’ వివరాలను వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తొలిసారిగా 5 అత్యంత శక్తివంతమైన ‘మల్టీ-వార్‌హెడ్’ క్షిపణులను ప్రయోగించింది. ఇవి గగనతలంలో విడిపోయి ఒకేసారి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇది 66వ విడత దాడి అని ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయేల్‌లోని టెల్ అవీవ్ నగరం, దక్షిణ ప్రాంతంలోని ప్రధాన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ ప్రయోగాలు జరిగాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా సైనిక బేస్‌లను కూడా ఈ క్షిపణులు విజయవంతంగా టచ్‌డౌన్ అయ్యాయని ఇరాన్ ప్రకటించింది. ఈ క్షిపణి దాడుల ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడింది. కువైట్‌పై డ్రోన్ దాడులు జరగ్గా.. సౌదీ అరేబియా తన తూర్పు ప్రాంతంలో 5 డ్రోన్లను కూల్చివేసినట్లు ధృవీకరించింది.

మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు (Bunkers) వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ చేపట్టిన తాజా ప్రతీకార చర్యలతో పశ్చిమ ఆసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలలతో పాటు ప్రపంచ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

హార్మూజ్ ఆపరేషన్ షురూ!

Next Story