- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lok Sabha: లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Waqf Amendment Bill) లోక్సభలో(Lok Sabha) ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన చేపట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు(Waqf Amendment Bill) లోక్సభలో(Lok Sabha) ప్రవేశపెట్టారు. కాగా.. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన చేపట్టారు. బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత దీనిపైన రిజిజు చర్చ చేపట్టారు. లోక్సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. "మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు" అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టకపోతే, పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు" అని సంచలన ప్రకటన చేశారు. కాగా.. ప్రతిపక్షాల నిరసన మధ్యే ఈ బిల్లుపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. వక్ఫ్ సవరణ బిల్లుని సమర్థించారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలించిందని.. క్యాబినెట్ ఆమోదం పొందే ముందు సూచనలను చేర్చిందని నొక్కి చెప్పారు. "మా ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీ లాంటిది కాదు. అది కేవలం ఓ రబ్బరు స్టాంప్. కానీ, మా కమిటీ క్షుణ్ణంగా చర్చలు జరిపింది. సూచనలు తీసుకుంది" అని అమిత్ షా అన్నారు. ఇకపోతే, దాదాపు 8 గంటలపాటు చర్చ జరిపిన తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
బిల్లుపై చర్చ
వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. అయితే, గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో జేపీసీ పరిశీలనకు ఈ బిల్లుని పంపింది.






