Virat Kohli : ఉగ్రదాడిని ఖండించిన విరాట్ కోహ్లీ

by Muthe.Rajitha |

జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

Virat Kohli : ఉగ్రదాడిని ఖండించిన విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనను ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖండించారు. ఈ చర్యకు ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ముష్కరుల కాల్పుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా కోహ్లీ ట్వీట్ చేశారు. అలాగే మరో క్రికెటర్ రోహిత్ శర్మ(Rohith Sharma).. ఈ దాడితో తన హృదయం ముక్కలైందని అన్నారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితో కేఎల్ రాహుల్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్ లు మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు.

Next Story