- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ విమాన ప్రమాదంలో దర్యాప్తు చేసేందుకు వస్తున్న యూఎస్ టీం..!
గుజరాత్ విమాన ప్రమాదంలో దర్యాప్తు చేసేందుకు వస్తున్న యూఎస్ టీం. త్వరలోనే భారత్కు వస్తున్న ఎన్టీఎస్బీ బృందం.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్లో ఎయిరిండియా విమానం కూలి, ఆ రాష్ట్ర మాజీ సీఎం సహా పలువురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం కనుక్కునేందుకు ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో భారత్కు సహకారం అందిస్తామని అమెరికాలో ఇలాంటి ప్రమాదాల ఇన్వెస్టిగేషన్ చేసే నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) తెలిపింది. ప్రస్తుతం భారత్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. దీనికి సహకరించేందుకు ఎన్టీఎస్బీ బృందం త్వరలోనే భారత్కు వస్తుందని సమాచారం. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్స్ ప్రకారం, ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను ఎన్టీఎస్బీకి భారత ప్రభుత్వం అందించనుంది. ఈ విషయంలో యూఎస్కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కూడా ఎన్టీఎస్బీతో టచ్లో ఉన్నట్లు సమాచారం.






