- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్ -పాక్ కాల్పుల విరమణ.. ఒప్పందంపై కీలక విషయాలు వెల్లడించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ మధ్య కాల్పుల విరమణ (Cease fire) ఒప్పందం జరిగింది. ఈ అంశంలో రంగలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఇరు దేశాల అధినేతలతో చర్చించి కాల్పుల విరమణకు కృషి చేశారు. దీనిపై అమెరికా విదేశాంగ కార్యదర్శి (US Secretary of State) మార్కో రుబియో (Marco Rubio) స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. గత 48 గంటలుగా తనతో పాటు వీపీ వాన్స్ (VP Vans) భారత్, పాక్ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల ప్రధానులు నరేంద్ర మోడీ (PM Narendra Modi), షహబాజ్ షరీఫ్ (Shehabaj Shareef), భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ (Union Minister Jaishankar), పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ (Asim Muneer), రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ (Ajit Doval), అసిమ్ మాలిక్ (Asim Malik) సహ ఇరు దేశాల సీనియర్లు పాల్గొన్నారని చెప్పారు. అలాగే చర్చల్లో భారత్, పాక్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అంగీకారం తెలిపాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని అన్నారు.
అంతేగాక ఈ సమయంలో శాంతి మార్గాన్ని ఎంచుకోవడంతో ప్రధానులు మోడీ, షరీఫ్ ల జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతను అభినందించారు. ఇక ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ, సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాక్ డీజీఎంఓ ఈ చర్యను ప్రారంభించారని, ఆ తర్వాత చర్చలు జరిగి, ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయని రూబియో చెప్పారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దీంతో పాక్ భారత్ సరిహద్దు స్థావరాలపై దాడులకు తెగబడుతోంది. పాక్ చేస్తున్న దాడులకు భారత్ సమాధానం చెబుతోంది. ఈ క్రమంలో భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్రదేశాధినేత ట్రంప్ చర్చలకు పిలుపినిచ్చి, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అవగాహన కుదిర్చారు.