భారత్‌కు అండగా ఉంటాం: ధ్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

భారత్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. భారత్, అమరికా మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై భారత ప్రధాని మోడీతో ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు...

భారత్‌కు అండగా ఉంటాం: ధ్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. భారత్, అమరికా మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై భారత ప్రధాని మోడీతో ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ తమకు ఆప్తమిత్రుడు అని, ఇరు దేశాల మధ్య త్వరలో ట్రేడ్ డీల్ జరగబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నామని ఆయన వెల్లడించారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ హర్మూర్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని తెలిపారు. పశ్చిమ ఆసియాలో శాంతికోసం ట్రంప్ కృషి చేశారని చెప్పారు. హర్మూర్ దగ్గర ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని, భారత నావికులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

Next Story