- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిక్ను చంపింది ప్రతిపక్షాలే.. ఉత్తర ప్రదేశ్ మంత్రి ధరమ్పాల్ సింగ్
by Javid Pasha |
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హత్య ప్రతిపక్షాల పనేనని యూపీ పశుసంవర్థక శాఖ మంత్రి ధరమ్ పాల్ సింగ్ ఆరోపించారు.

X
లక్నో: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ హత్య ప్రతిపక్షాల పనేనని యూపీ పశుసంవర్థక శాఖ మంత్రి ధరమ్ పాల్ సింగ్ ఆరోపించారు. చందవాసి పౌర ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విపక్షాల రహస్యాలను ఎక్కడ బయటపెతారోననే భయంతోనే హత్యకు పాల్పడ్డారని విమర్శించారు. బీజేపీ శ్రేణులు ఎల్లవేళలా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కాగా, ఇటీవల ప్రయాగ్ రాజ్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్లను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనిపై యూపీ ప్రభుత్వం జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది.
Next Story






