- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాఖీ పండుగ.. మేనమామను కాల్చి చంపిన అల్లుడు.. సంచలనం రేపుతున్న ఘటన
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ మీరట్లో దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామను కాల్చి చంపాడు అల్లుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుండగా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. పైగా రాఖీ పండుగ రోజే ఇలాంటి ఘటన జరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్లో దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామను కాల్చి చంపాడు అల్లుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుండగా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. పైగా రాఖీ పండుగ రోజే ఇలాంటి ఘటన జరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అస్లాం లిసారీ గేట్లో తన పిల్లలను కోచింగ్ సెంటర్లో వదిలేందుకు వెళ్లాడు. తిరిగొస్తుండగా.. అల్లుడు సుభాన్ అకస్మాత్తుగా ఎటాక్ చేశాడు. కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆస్తి వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో ఇద్దరికీ పోటీ ఉండటం, తరుచూ ఆస్తి పరమైన గొడవలు తలెత్తడం జరుగుతోందని మృతుడి భార్య చెప్తోంది. ప్రస్తుతం సుభాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






