బస్సుపై విరిగిపడిన చెట్టు.. డ్రైవర్‌తో సహా ఐదుగురు స్పాట్ డెడ్.. 17మందికి గాయాలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-08 12:10:11  IST  )

ఉత్తరప్రదేశ్ భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బారాబంకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్ గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా...

బస్సుపై విరిగిపడిన చెట్టు.. డ్రైవర్‌తో సహా ఐదుగురు స్పాట్ డెడ్.. 17మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బారాబంకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్ గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా... డ్రైవర్‌తోపాటు నలుగురు మహిళలు స్పాట్‌లోనే చనిపోయారు. పదిహేడు మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాగా జైద్‌పూర్ పీఎస్ పరిధిలో జరిగిన యాక్సిడెంట్‌లో కడిపూర్ ప్రైమరీ స్కూల్ టీచర్ శిక్షా మల్హోత్రా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సంతాపం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Next Story