చిన్నారులపై అరగంటకో అఘాయిత్యం.. యూఎన్ మానవహక్కుల కమిషనర్ ఆవేదన

by Phanindra |   (  Updated:2025-06-19 18:40:12  IST  )

కాంగోలో చిన్నారులపై అరగంటకో అఘాయిత్యం జరుగుతోందని, యుద్ధం పేరుతో జరిగే ఈ ఘోరాలు ఆపాలని యూఎన్ మానవహక్కుల కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నారులపై అరగంటకో అఘాయిత్యం.. యూఎన్ మానవహక్కుల కమిషనర్ ఆవేదన
X

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధం పేరుతో చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో అధికారిక లెక్కల ప్రకారం చిన్నారులపై అత్యాచారాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి అరగంటకు ఒక చిన్నారిపై అత్యాచారం జరుగుతోందని వోల్కర్ టర్క్ వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో లైంగిక దాడులు కూడా యుద్ధతంత్రాల్లో భాగంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. హింస, ఘోరాలు, అస్థిరత్వం, నివాస ప్రాంతాలు కోల్పోవడం వంటి సమస్యలు తీరాలంటే రక్షణ, న్యాయం, శాంతి కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ మేరకు ‘ఎండ్ రేప్ ఇన్ వార్’ అనే ట్యాగ్‌తో తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.

Next Story