పరువు నష్టం కేసులో ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు సమన్లు​జారీ

by Disha Web Desk 12 |
పరువు నష్టం కేసులో ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు సమన్లు​జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది. ఏక్‌నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమేష్ షెవాలే వేసిన పరువు నష్టం కేసులో శివసేన (యుబిటి) నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కాగా గతంలో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లు శివసేన చిహ్నాన్ని ₹2,000 కోట్లకు కొనుగోలు చేసిందని మీడియా సమావేశాల్లో, మిటింట్‌లలో షిండే వర్గంపై ఆరోపణలు చేశారు. ఎలక్షన్ అధికారులు కూడా ఇందులో ఉన్నారని ఆరోపణలు చేయగా.. రాహుల్ రమేష్ షెవాలే కోర్టులో కేసు వేశాడు. దీంతో వారికి మంగళవారం ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.



Next Story

Most Viewed