- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పరువు నష్టం కేసులో ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లకు సమన్లుజారీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది. ఏక్నాథ్ షిండే వర్గం నేత రాహుల్ రమేష్ షెవాలే వేసిన పరువు నష్టం కేసులో శివసేన (యుబిటి) నేతలు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కాగా గతంలో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్లు శివసేన చిహ్నాన్ని ₹2,000 కోట్లకు కొనుగోలు చేసిందని మీడియా సమావేశాల్లో, మిటింట్లలో షిండే వర్గంపై ఆరోపణలు చేశారు. ఎలక్షన్ అధికారులు కూడా ఇందులో ఉన్నారని ఆరోపణలు చేయగా.. రాహుల్ రమేష్ షెవాలే కోర్టులో కేసు వేశాడు. దీంతో వారికి మంగళవారం ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
Next Story