- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమాషాలు వద్దు.. వెంటనే శాంతి చర్చలకు రండి: ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం
పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలై నాలుగు వారాలు గడుస్తున్నా పరిస్థితి చల్లబడకపోగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలై నాలుగు వారాలు గడుస్తున్నా పరిస్థితి చల్లబడకపోగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందంపై సీరియస్గా దృష్టి పెట్టాలని, లేదంటే "తిరుగులేని" భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా ట్రంప్ పోస్టు పెట్టారు. "సమయం మించిపోకముందే ఇరాన్ మేల్కోవాలి. ఒక్కసారి చర్యలు మొదలైతే వెనక్కి తగ్గడం ఉండదు, అది ఏమాత్రం బాగుండదు. యుద్ధం ఆపాలని ఇరాన్ చర్చల కోసం ప్రాధేయపడుతోంది, కానీ బయటకు మాత్రం వింతగా ప్రవర్తిస్తోంది" అని ట్రంప్ పేర్కొన్నారు.
చర్చలు కొలిక్కి రాకపోతే...
అంతేకాకుండా, ఇరాన్ సైనిక పరంగా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని, కోలుకునే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను కేవలం 'పరిశీలిస్తున్నాం' అని ఇరాన్ చెప్పడం అబద్ధమని, వారు చర్చల కోసం వెంపర్లాడుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. అయితే, అమెరికా చేస్తున్న ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి పత్రాన్ని పరిశీలిస్తున్న మాట నిజమేనని, అయితే వాషింగ్టన్తో నేరుగా చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపడం అంటే అది చర్చలు జరపడం కాదని ఆయన వివరించారు. మరోవైపు, చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. చర్చలు కొలిక్కి రాకపోతే, ఇరాన్కు కీలకమైన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island) చమురు పోర్టును స్వాధీనం చేసుకోవడం లేదా హార్ముజ్ జలసంధిని బలవంతంగా పునరుద్ధరించడం వంటి చర్యలకు అమెరికా దిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






