- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన ప్రకటన.. ఇతర దేశాలకు పిలుపు!
ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం 15వ రోజుకు చేరుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.

దిశ, వెబ్డెస్క్: ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం 15వ రోజుకు చేరుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) సురక్షితంగా ఉంచేందుకు ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా నౌకాదళం త్వరలోనే చమురు ట్యాంకర్లకు రక్షణగా (Escort) నిలుస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాల వల్ల ఇబ్బంది పడుతున్నాయని, ఆయా దేశాలు తమ నౌకలను పంపి జలసంధిని తెరిచి ఉంచడంలో సహకరించాలని కోరారు.
ఇరాన్ సైన్యం విధ్వంసం..
ఇరాన్ సైనిక సామర్థ్యం 100 శాతం ధ్వంసమైందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఎంత ఓడిపోయినా ఇరాన్ ఇప్పటికీ ఒకటి రెండు డ్రోన్లను పంపడం లేదా క్షిపణులతో దాడులు చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island)లోని సైనిక స్థావరాలను అమెరికా ధ్వంసం చేసిందని ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఇరాన్ పద్ధతి మార్చుకోకపోతే, వారి పూర్తి చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటనలో అమెరికాకు గట్టి సవాల్ విసిరారు. అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు హోర్ముజ్ జలసంధిని మూసి ఉంచడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సుమారు మార్చి 1 నుంచే ఈ మార్గం మూసివేయబడినట్లు సమాచారం. ప్రాంతీయ భద్రత పేరుతో అమెరికా అబద్ధాలు చెబుతోందని, తక్షణమే మధ్యప్రాచ్యం నుండి అమెరికా తన సైనిక స్థావరాలను తొలగించాలని, లేకపోతే దాడులు తప్పవని హెచ్చరించారు.
హార్మూజ్ జలసంధి ప్రాముఖ్యత ఏంటి?
ప్రపంచ ఇంధన అవసరాల్లో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైనది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచంలోని 20 శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) వ్యాపారం ఈ జలసంధి మీదుగానే జరుగుతుంది. ఈ మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






