ఇరాన్ అణుశక్తికి చెక్ పెట్టాం.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

ఇరాన్ అణుకేంద్రాలపై చేసిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ అణుశక్తికి చెక్ పెట్టాం.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ అణుకేంద్రాలపై చేసిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని నాశనం చేసిందని అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ అణు సంస్థ నివేదికల ఆధారంగా చేశారని తెలిపారు.

బుధవారం ట్రూత్ సోషల్ లో చేసిన పోస్ట్ లో ఇరాన్ లోని ఫోర్డో ఎన్‌రిచ్‌మెంట్ సైట్ పై ఇరాక్ (Israel Atomic Energy Commission) చేసిన అంచనాను ట్రంప్ ప్రస్తావించారు. ఇజ్రాయెల్ అణు సంస్థ ప్రకారం.. ఇరాన్‌లోని ప్రముఖ అణు సదుపాయమైన "ఫోర్డో ఎన్‌రిచ్‌మెంట్ సైట్" పూర్తిగా పనికిరాని స్థితిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. దీని వల్ల ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధి అన్ని సంవత్సరాల పాటు వాయిదా పడింది అని ట్రంప్ తెలిపారు.

అయితే అమెరికా రక్షణ గోప్య విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) లీక్ చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ దాడుల వల్ల పరిమితమైన నష్టం మాత్రమే సంభవించిందని, కేవలం నెలల పాటు మాత్రమే ఇరాన్ అణు ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు.

ఈ నివేదికలను ట్రంప్ ఖండించారు. DIA నివేదికను ఆయన తప్పుడు అంచనాగా అభివర్ణించారు. పైలట్లు, ముఖ్యంగా B-2 బాంబర్లను నడిపిన సిబ్బంది చక్కగా పని చేశారని చెప్పారు. “మీడియా వీరిని అపహాస్యం చేస్తోంది. ఇది జాగ్రత్తగా చూస్తే అప్రాథమికమైన చర్య” అంటూ విమర్శలు చేశారు.

వైట్ హౌస్ అధికార ప్రతినిధులు కూడా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా స్పందించారు. ఇజ్రాయెల్ నివేదికను ఆధారంగా చూపిస్తూ అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం తప్పు అని పేర్కొన్నారు. ట్రంప్ వద్ద ఇంకా బయటపెట్టని ఆధారాలున్నాయని కూడా వెల్లడించారు.

ఇరాన్ అధికారులు తమ సదుపాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని అంగీకరించినప్పటికీ పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు. ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇరాన్ అణుకేంద్రాల్లోని సెంట్రిఫ్యూజులు చాలా వరకూ పనిచేస్తున్నాయి. ఉపగ్రహ చిత్రాలు ఫోర్డో ప్రాంతంలో భారీ పేలుళ్లలు చూపుతున్నప్పటికీ భూగర్భ సదుపాయాల పూర్తి ధ్వంసంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ దాడుల వల్ల ఎటువంటి స్థాయిలో ఇరాన్ అణు ప్రోగ్రామ్‌ దెబ్బతిన్నదనే విషయంలో స్పష్టత రాలేదు.

ట్రంప్.. ఇజ్రాయెల్ నివేదికల ఆధారంగా ఇరాన్ అణు శక్తికి చెక్ పెట్టాం అని చెబుతుండగా.. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి.

Next Story