ఫలితాలు: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?

by Disha Web Desk 2 |
ఫలితాలు: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ల్లోని కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 31 సీట్లు కావాల్సి ఉంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది మరికాసేపట్లోనే తేలిపోనుంది. ప్రస్తుతం త్రిపురలో 20 స్థానాల్లో బీజేపీ, 17 స్థానాల్లో సీపీఎం, 8 స్థానాల్లో టీఎంపీ పార్టీలు లీడ్‌లో కొనసాగుతున్నాయి. నాగలాండ్‌లో 23 స్థానాల్లో ఎన్డీపీపీ, 3 స్థానాల్లో ఎన్పీఎఫ్, 1 స్థానంలో కాంగ్రెస్‌ లీడ్‌లో కొనసాగుతున్నాయి. మేఘాలయలో 9 స్థానాల్లో ఎన్పీపీ, 4 స్థానాల్లో బీజేపీ, 6 స్థానాల్లో కాంగ్రెస్, 12 స్థానాల్లో ఏఐటీసీ, ఇతరులు 9 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు.



Next Story