పీఎం కిసాన్ నమోదుకు నేడే చివరి తేదీ

by Disha Web Desk 2 |
పీఎం కిసాన్ నమోదుకు నేడే చివరి తేదీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ధరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని రైతులు ఈ రోజు(బుధవారం) వరకు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ మేరకు PMKISAN.GOV.IN సైట్ లోకి లేదంటే దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి అన్నదాతలు ఈ పథకంలో అర్హులుగా చేరేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 2021 గణాంకాల ప్రకారం 39,37,482 మంది ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే జూలైతో ముగిసిన నమోదును నేటి వరకు పొడిగించారు.

Next Story

Most Viewed