- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్లో ప్రజాస్వామ్య పండుగ..యువ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు
ఈ రోజు ఉదయం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న బిహార్ మొదటి విడత ఎన్నికలు ప్రారంభం అయ్యాయి

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 56 కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగించనున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (X) వేదికగా ఓ ట్వీట్ చేస్తూ బిహార్ ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. “బిహార్లో ప్రజాస్వామ్య పండుగకు మొదటి దశ నేడు ప్రారంభమైంది. ఈ దశలో ఉన్న ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయాలి. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేయబోతున్న యువతకు నా హృదయపూర్వక అభినందనలు. గుర్తుంచుకోండి — మొదట ఓటు వేయండి, ఆ తర్వాతే పలహారం తీసుకోండి,” అని మోదీ ఆకట్టుకునే పద్ధతిలో పిలుపునిచ్చారు.






