- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆప్ రాజ్యసభ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా కాషాయ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ముగ్గురి చేరికతో ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అయంది. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా ఆప్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారు అంటూ వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నిజాయితీ కలిగిన వారికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తొలగింపు..
గత కొన్ని రోజులుగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న రాఘవ్ చద్దాను, ఇటీవలే రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారడం గమనార్హం. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడంతో పార్లమెంటులో ఆప్ బలం గణనీయంగా తగ్గింది. పార్టీలో అత్యంత కీలకమైన యువ నేత బీజేపీలోకి వెళ్లడం కేజ్రీవాల్కు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. దేశ రాజధాని రాజకీయాల్లో ఈ మార్పులు పెను మార్పులకు సంకేతంగా మారుతున్నాయి.






