జాక్‌పాట్ అంటే ఇదే.. లాటరీలో ఏకంగా రూ. 16 కోట్లు గెలుచుకున్న భారతీయుడు

by Disha Web Desk 4 |
జాక్‌పాట్ అంటే ఇదే.. లాటరీలో ఏకంగా రూ. 16 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: లాటరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ.16 కోట్లు గెలుచుకున్నాడు. తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ అనే వ్యక్తి ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్ 5 గ్రాండ్ ప్రైజ్ సొంతం చేసుకున్నాడు. బహుమతి కింద వచ్చే 25 ఏళ్లు ప్రతి నెలా సుమారు రూ.5.6లక్షలు లభించనుంది. తమిళనాడు రాష్ట్రం అంబూర్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న మాగేష్ కుమార్ 2019లో సౌదీ అరేబియాలో జాబ్ వచ్చింది. అయితో మొదటినుంచి లాటరీలపై మాగేష్ కుమార్‌కు ఆసక్తి. లాటరీ తగలడంతో రూ.16 కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా మాగేష్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి తాను అనేక కష్టాలు చూశానని.. వచ్చిన సొమ్ముతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇస్తానన్నాడు. సమాజానికి తన వంతుగా సాయం చేస్తానని ప్రకటించాడు.


Next Story

Most Viewed