- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశ భవిష్యత్తును కాపాడేందుకు ఈ ఎన్నికలు కీలకం: ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల కూటమి ఇండియాపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. అవినీతిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు అవినీతిపరులంతా ఏకతాటిపై వస్తున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవేనని మోడీ అన్నారు. మంగళవారం రాజస్థాన్లోని కోక్పుటాలిలో జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడిన మోడీ, బీజేపీ గెలిస్తే దేశంలో మంటల్లో చిక్కుకుంటుందని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. గత 10 ఏళ్లుగా మోడీ అలాంటి మంటలనే ఆర్పేస్తున్నారు. తమ కుటుంబాలను కాపాడుకోవడానికి ర్యాలీల మీద ర్యాలీలు నిర్వహించిన తర్వాత కుటుంబ ఆధారిత పార్టీలు పాల్గొంటున్న మొదటి ఎన్నికలు ఇవేనని మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రమాదకరమైన ఉద్దేశాలను నెమ్మదిగా బయటపెడుతున్నారని, దేశ భవిష్యత్తును కాపాడేందుకు ఈ ఎన్నికలు చాలా కీలకమని మోడీ తెలిపారు. గత పదేళ్లలో జరిగిన మొత్తం అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, ఇంకా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.