- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు: ప్రధాని మోడీ
పశ్చిమ ఆసియా (గల్ఫ్) దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్డెస్క్: పశ్చిమ ఆసియా (గల్ఫ్) దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, అదే సమయంలో దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మందికి పైగా భారతీయ కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుత యుద్ధ సంక్షోభం వారి భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు. "యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రతి భారతీయుడిని రక్షించేందుకు మా రాయబార కార్యాలయాలు 24/7 పనిచేస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు," అని మోడీ పేర్కొన్నారు.
ఇంధన నిల్వలు పుష్కలం..
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నప్పటికీ.. భారతదేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని ప్రధాని భరోసా ఇచ్చారు. దేశ అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోందని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల అగ్రనేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, ఉద్రిక్తతలు తగ్గాలని భారత్ కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.






